Dalitha Bandhu : ఒక్కొక్కరి ఖాతాలో రూ.10లక్షలు.. వాసాలమర్రిలో సంబరాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రి దళిత వాడల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వాసాలమర్రి గ్రామంలోని 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ. 6.6 కోట్ల నగదు జమ..

Dalitha Bandhu
Dalitha Bandhu : తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రి దళిత వాడల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వాసాలమర్రి గ్రామంలోని 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ. 6.6 కోట్ల నగదు జమ అయింది. గురువారం ఉదయం నుంచి వారి సెల్ఫోన్లకు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్లు వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇక తమ కాళ్ల మీద తాము నిలబడేలా పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ తదితర యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఆయా యూనిట్లపై అవగాహన కల్పించేందుకు అధికారులు గురువారం లబ్ధిదారులను బస్సులో క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకెళ్లారు.
Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
సీఎం కేసీఆర్ హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి దళితులకు దళితబంధు సాయం అందింది. సీఎం చెప్పినట్లుగా లబ్దిదారుల ఖాతాల్లో దళితబంధు నిధులు డిపాజిట్ అయ్యాయి. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకుగానూ.. 66మంది ఖాతాల్లో నగదు జమైంది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదును జిల్లా కలెక్టర్ ఖాతా నుంచి లబ్దిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది.
ఇప్పటికే హుజూరాబాద్ లో లబ్దిదారుల కుటుంబాల్లో నగదు జమ చేసింది ప్రభుత్వం. దళితబంధు డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో దళిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కేసీఆర్ దేవుడు అని నీరాజనాలు పలుకుతున్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Debit Cards : నో నెట్వర్క్.. ఆఫ్లైన్లోనూ డెబిట్ కార్డులు వాడొచ్చు!
‘‘తెలంగాణ దళిత బంధు’’ పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతో పాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది. ‘‘దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్థితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.