Income Tax Raids : అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ముగిసిన ఐటీ అధికారుల సోదాలు

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి అధికారులు వెళ్లిపోయారు.

Income Tax Raids : అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ముగిసిన ఐటీ అధికారుల సోదాలు

Income Tax Raids

Income Tax Raids : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముగిశాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం విధితమే. గత బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు నిన్న అర్ధరాత్రి 2 గంటలకు ముగిశాయి. అయితే, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో తొలిరోజు సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించారు.

Income Tax Raids : తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు

మూడు రోజులపాటు సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటలకు ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మూడు రోజులపాటు జరిపిన సోదాల్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బ్యాంకు లాకర్స్, కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లపై ఐటీ అధికారులు ఆరాతీశారు. సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు ఐటీ అధికారులు నోటీసులిచ్చారు.

Income Tax Raids : పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి నివాసాలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల వ్యాపార కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు దాడులు జరిపినట్లు తెలిసింది. హార్డ్ డిస్క్ లు, బ్యాంక్ లాకర్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులు జరగడాన్ని నిరసిస్తూ.. ఆ పార్టీ నేతలు అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ దాడులపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.