ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారు.. ఇప్పుడు కూడా అలాచేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్

హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడురోజులైనా గుర్తించలేరా అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారు.. ఇప్పుడు కూడా అలాచేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్

KTR

Updated On : September 16, 2025 / 6:58 PM IST

KTR: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఆరుగురి మృతదేహాలను తీయలేకపోయిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలను కూడా తీయలేకపోతోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

కేటీఆర్ ఇవాళ ఎక్స్‌లో ట్వీట్‌ చేస్తూ.. “రేవంత్.. మీ కాంగ్రెస్ సర్కారు ఘోర తప్పిదం వల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశావు. చివరికి హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి పార్థివదేహాలను మూడురోజులైనా గుర్తించలేవా?

Also Read: బృహస్పతి అమృతంతో అభిషేకించిన మాధవేశ్వరీ దేవి.. విగ్రహారాధనలేని శక్తి పీఠం

ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటదా? కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వంలేని కాంగ్రెస్‌కు వినిపించడం లేదా ? (KTR)

చిన్న పాటి వర్షానికే పొంగిపొర్లుతున్న నాలాలు, చివరికి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి ఏం చేస్తున్నట్టు? విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటుచేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను కూడా నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఆరుగురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారు. నాలాల్లో బలిచేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు” అని చెప్పారు.