నల్గొండ జిల్లాలో చిక్కిన చిరుతపులి మృతి

నల్గొండ జిల్లాలో అటవీఅధికారులకు చిక్కిన చిరుతపులి మృతి చెందింది. హైదరాబాద్ కు తరలిస్తుండగా దారిలో చనిపోయినట్లు జూపార్క్ వైద్యులు తెలిపారు. చిరుతపులికి హైదరాబాద్ లోనే పోస్టుమార్టం నిర్వహించారు. చిరుతను ఉచ్చులో బిగించడంతో ఉక్కిరిబిక్కరైందని జూపార్క్ వైద్యులు తెలిపారు. ఎక్కువ మంది జనాన్ని చూడటంతో చిరుత ఆందోళనకు గురైందన్నారు. చిరుతకు అంతర్గతంగా కూడా గాయాలైనట్లు గుర్తించామని తెలిపారు. మృతి చెందిన చిరుతపులికి ఏడు సంవత్సరాలని తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు చిరుత పులి చిక్కింది. రెండు గంటలపాటు కష్టపడి ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకున్నారు. మర్రిగూడెం మండలం రాజంపేట తండాలో చిరుత ప్రత్యక్షమైంది. రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. చిరుతను బంధించేందుకు వచ్చిన అధికారులపై చిరుత దాడి చేసింది.
చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా తప్పించుకుని వారిపై దాడి చేసింది. చిరుత దాడిలో ఇద్దరు ఫారెస్టు అధికారులు గాయాలు అయ్యాయి. తర్వాత రెండు గంటలపాటు కష్టపడి ఫారెస్టు అధికారులు బంధించారు. చిరుతను బంధించేక్రమంలో దానికి గాయాలయ్యాయి. హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయింది.