Singareni Elections : సీఎం పక్కన కూర్చునైనా సంతకం పెట్టిస్తా.. మీ సమస్యలు తీరుస్తా : సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి హామీ

సింగరేణిఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

Singareni Elections : సీఎం పక్కన కూర్చునైనా సంతకం పెట్టిస్తా.. మీ సమస్యలు తీరుస్తా : సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి హామీ

Singareni Elections

Telangana Singareni Elections : ‘‘నేను కీలక మంత్రి పదవిలో ఉన్నా..సీఎం పక్కన కూర్చునైనా సంతకం పెట్టిస్తాను..మీ సమస్యలు తీరుస్తాను’’ అంటూ సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటీ హామీ ఇచ్చారు. ఇల్లందులో సింగరేణిఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి వ్యాప్తంగా ఒక్కచోట మినహా అన్నిచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారని..కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉంది కాబట్టే గెలుపొందారని అన్నారు. సింగరేణి ఎన్నికల్లోను ఐ ఎన్ టి యూ సి ని గెలిపించాలని కోరారు.

2017 నుండి సింగరేణి కార్మికుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉందన్నారు. గతంలోనే జరగాల్సిన ఎన్నికలను గత ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం అవకతవకలతో కార్మికులను పట్టించుకోలేదని ..గత ప్రభుత్వ హయాంలో తాను కూడా మీతో పాటు నేను కూడా నమ్మి మోస పోయినానని అన్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తాను సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తానని దాని కోసం సమస్యల పరిష్కారం కోసం సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తానని భరోసా ఇచ్చారు.

గత ఐదు సంవత్సరాలలో సింగరేణి గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని..తమ మ్యానిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో సింగరేణి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.ఇల్లందులో జేకే ఓ సి విస్తరణలో ఇక్కడ కార్మికులు బదిలీ కాకుండా… ఇంకొక మైనింగ్ ఫిట్3 తో కార్మికులు ఇక్కడే విధుల్లో ఉండేలా చూస్తామన్నారు.కార్మికుల సొంతింటి కల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని చెప్పిన గత ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు.

కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు తమ ప్రభుత్వ హయాంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇక నుంచి సమస్యల గురించి ఎవరు పోరాటం చేయాల్సిన అసవరం ఉండదని..అటువంటి పరిస్థితి ఇంకా ఉండవన్నారు. మరో 20 సంవత్సరాలు ప్రభుత్వంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. గతంలో కారుణ్య నియామకాలు కోసం కార్మికులు రూ.లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేదని కానీ ఇకనుంచి ఒక్క రుపాయి ఖర్చు పెట్ట కుండ కారుణ్య నియామకాలు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

అలాగే పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.ఆర్జీ 3 పరిధిలోని ALP, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున పాల్గొన్న శ్రీధర్ బాబు మాట్లాడుతు..ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు.సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని..కొత్త అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని..అలాగే కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.