Eatala Jamuna : ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు : ఈటల సతీమణి జమున

సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నాడని ఆరోపించారు. హుజురాబాద్ లో ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి వదిలి పెట్టారని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల జమున వ్యాఖ్యానించారు.

Eatala Jamuna : ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు : ఈటల సతీమణి జమున

Etala Jamuna

Eatala Jamuna Allegations Kaushik Reddy : ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ను చంపే కుట్ర జరుగుంతోందని అన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈటల హత్యకు రూ.20కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నాడు అంటా అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నాడని ఆరోపించారు.

హుజురాబాద్ లో ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి వదిలి పెట్టారని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల జమున మాట్లాడారు. ఆయన తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పించారని కౌశిక్ రెడ్డి చెపుతాడని తెలిపారు. ఆయన తల్లిదండ్రుల వద్ద ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి బాగానే ఉండేవాడు కావచ్చు… కానీ, ప్రగతి భవన్ లో చేరి పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Vande Bharat Trains : దేశంలో మరో ఐదు వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

హుజురాబాద్ లో చందాలు వేసుకుని కట్టిన అమరుల స్థూపని కూలకొట్టారని తెలిపారు. అమరుల స్థూపంపై ఈటల రాజేందర్ పేరు ఉందని కూలకొట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డి ఇలా వ్యహారిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారని వెల్లడించారు. కనీసం ఉద్యమకారుడు కూడా కానీ కౌశిక్ రెడ్డి.. జేసీబీతో అమరుల స్థూపాన్ని కూలకొట్టాడని ఆరోపించారు. వెంటనే కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి గవర్నర్ ను సైతం నోటితో చెప్పారని మాటలు అన్నాడని తెలిపారు.

గవర్నర్ ను తిట్టిన తరువాత కేటీఆర్.. హుజురాబాద్ కు వెళ్ళి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాడని పేర్కొన్నారు. మహేందర్ గౌడ్ అనే సర్పంచ్ ను ఏమీ చేయకున్నా కేసులు పెట్టారని విమర్శించారు. మహేందర్ గౌడ్ ను కొడుతుంటే వీడియోలు చూపెట్టాలని అన్నాడు అంటా అని అన్నారు. ఏ ఆఫీస్ కు వెళ్లినా కౌశిక్ రెడ్డి చెప్పారని అధికారులు అంటున్నారని వెల్లడించారు.

MLA Jagga Reddy : అందరి ముందే రాహుల్ గాంధీకి అన్నీ చెబుతా : జగ్గారెడ్డి

కౌశిక్ రెడ్డి చెబితేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు సైతం అంటున్నారు అంటా అని తెలిపారు. మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ఎంపీడీఓను యూజ్ లెస్ ఫెల్లో అంటూ తిట్టాడంటా అని వెల్లడించారు. రైతు సమస్యలపై ఒక రైతు మాట్లాడితే అతనిని బూతులు తిట్టాడు అంటా అని పేర్కొన్నారు. ఈటలను రూ.20 కోట్లు పెట్టి చంపిస్తాం.. అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.