Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 31వేల 265 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 24వేల 360 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 794కి తగ్గింది.

Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

Telangana Covid

Updated On : August 19, 2022 / 9:17 PM IST

Telangana Covid News : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో (435) పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 212 మందికి కరోనా పరీక్షలు చేయగా, 450 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 220 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 30 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 476 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 31వేల 265 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 24వేల 360 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 794కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 29వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 435 మందికి పాజిటివ్ గా తేలింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్..