Telangana Covid Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు

COVID19 cases in India

Updated On : July 19, 2022 / 9:47 PM IST

Telangana Covid Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30వేల 552 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 658 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 316 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41 కేసులు, ఖమ్మంలో 30 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 25 కేసులు, నల్గొండ జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 628 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8,10,976 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 02వేల 354 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 511కి చేరింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 25వేల 585 కరోనా టెస్టులు చేయగా.. 540 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.