TSPSC Paper Leak : పేపర్ లీక్.. నిందితురాలు రేణుకకు ఎదురుదెబ్బ

ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్నారు. కస్టడీపై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు ప్రకటించనుంది.(TSPSC Paper Leak)

TSPSC Paper Leak : పేపర్ లీక్.. నిందితురాలు రేణుకకు ఎదురుదెబ్బ

Updated On : April 1, 2023 / 9:51 PM IST

TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్ కేసు నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇటీవల అరెస్ట్ అయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యల కస్టడీ కోరారు సిట్ అధికారులు.

ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్నారు. కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు ప్రకటించనుంది. ఇక ఈ కేసులో ముగ్గురు నిందితులకు నాలుగో రోజు సిట్ విచారణ ముగిసింది. సిట్ ఆఫీస్ నుంచి పాత సీసీఎస్ కు ముగ్గురు నిందితులను తరలించారు.

Also Read..Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలి.. మంత్రి కేటీఆర్ ను విచారించాలి : రేవంత్ రెడ్డి

TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసులో రేణున ఏ-3 నిందితురాలిగా ఉన్నారు. ఆమె బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించారు. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, ఇంటి దగ్గరున్న తన పిల్లలను చూసుకోవాలని తెలుపుతూ తనకు బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రేణుక. అయితే, రేణుక వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని రేణుక నిర్ణయించింది.

ఈ కేసులో రేణుక కీలక నిందితురాలిగా ఉన్నారు. దీంతో ఆమె బెయిల్ ఇవ్వొద్దని అధికారులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ పిటిషన్ కొట్టివేసింది.

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీ కోరుతూ సిట్ అధికారులు మరోసారి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల అరెస్ట్ అయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్య.. ఈ ముగ్గురినీ వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. సోమవారం కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. మరికొందరు నిందితులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పైనా నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

మరోవైపు పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటివరకూ నిందితులు, ఉద్యోగులే కేంద్రంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు తాజాగా టీఎస్‌పీఎస్ సీ బోర్డు సభ్యులనా ఫోకస్ పెట్టారు. బోర్డు సభ్యలకూ సిట్ అధికారులు నోటీసులిచ్చారు. ఈ కేసుకు సంబంధించి బోర్డు చైర్మన్, సెక్రటరీలను కూడా విచారించారు.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

బోర్డ్ మెంబర్ లింగారెడ్డి పీఏ రమేశ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీక్‌లో అతడి పాత్రపై విచారిస్తున్నారు. అంతేకాకుండా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏడుగురు సభ్యుల స్టేట్‌మెంట్‌‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. బోర్డులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సిట్ అధికారులు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ రూంలోకి ఎవరు పడితే వారు వెళ్లడం, ఏకంగా పెన్ డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలను కాపీ చేయడం.. ఈ ఘటనలతో అక్కడ నిఘా నామమాత్రంగా ఉందనే అంచనాకు వచ్చారు.

అటు..బోర్డు సభ్యుడు లింగారెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అటు టీఎస్ పీఎస్ సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ను కూడా విచారించారు. సిట్ ఆఫీసులో అనితా రామచంద్రన్ ను విచారించిన అధికారులు.. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించారు.