ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 02:00 PM IST
ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్ కీలక నిర్ణయం

Updated On : November 9, 2019 / 2:00 PM IST

ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని

ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముందు అనుకున్నారు. తాజాగా ఆ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. 6వ తరగతి వరకే ఇంగ్లీష్ మీడియంను వర్తింపజేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

శనివారం(నవంబర్ 9,2019) విద్యాశాఖ అధికారులో సమీక్ష నిర్వహించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రతి స్కూల్ లోనూ ఇంగ్లీష్ భాషకు సంబంధించి ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్ లో ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలు పాటించాలన్నారు సీఎం జగన్.

ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీలో దుమారం రేగుతోంది.  ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తే రాబోయే రోజుల్లో తెలుగు భాష  కనుమరుగయ్యే ప్రమాదముందని ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, తెలుగు పండితులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. 

నవంబర్ 14న ప్రకాశం జిల్లాలో నాడు-నేడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలు, కొత్తపట్నంలోని పలు పాఠశాలలను సందర్శించి క్లాస్ రూమ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. అనంతరం ఒంగోలులోని పీవీఆర్ బాయ్స్ స్కూల్ లో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో బోధనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ చెప్పారు.