కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం
అవినీతి రహిత పాలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.

అవినీతి రహిత పాలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
అవినీతి రహిత పాలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వ్యవస్థలను కాపాడాలని సీఎం జగన్ కోరికన్నారు. మంగళవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనతో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి కాపాడాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. చట్టబద్దంగా, రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అందరికి జవాబుదారీగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఉద్యోగుల యోగక్షేమాలను ప్రభుత్వం చూస్తుందన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఉన్నతాధికారులతో చర్చించి, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు.
ప్రభుత్వంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని కోరారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. ఎవ్వరినీ తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఇది సీఎం జగన్ తమందరితో చెప్పిన మాటని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
Also Read : పబ్జీ ఆడొద్దన్నందుకు తండ్రిని చంపాడు