పాటకే బాలు జోలపాట

S P Balasubramaniam: భారతదేశం తీర్చిదిద్దిన గొప్ప గాయకుడు. రెండు, మూడు తరాలు ఆయన పాటలువిని పెరిగింది. పాడింది. కొత్తతరం ఆయన శిష్యరికంలోనే ఎదిగింది. భారతదేశ గొప్ప గాయకతరంలో ఆయనది ముందు వరస.
ఆయన గాత్రం వింటే మధురాన్ని గొంతులో దాచుకున్నారా? శృతి చేయడానికి రాగాలు పోటీపడుతున్నాయా అన్నట్లుగా ఆయన పాట వినిపిస్తుంది. కథనాయలెవరైనా పాడేది మాత్రం బాలునే. ఆయన అందించిన సినీగానం 50వ వడిని దాటింది. పాట అంటే ఇలాగే పాడాలేమో అని తరాల శ్రోతలు అనుకునేట్టు చేశారు. గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు రాసుకున్నారు.