తండ్రి కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన జరిగింది. తండ్రి కొడుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఓ బాలుడు ఫిర్యాదు చేశాడు.
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన జరిగింది. తండ్రి కొడుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఓ బాలుడు ఫిర్యాదు చేశాడు.
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన జరిగింది. తండ్రి కొడుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఓ బాలుడు ఫిర్యాదు చేశాడు. వర్ని మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వర్ని మండలం ఒడ్డేపల్లికి చెందిన ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న మహేష్ అనే బాలుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి శివ నిత్యం తనను కొడుతూ, వేధిస్తున్నాడని పోలీసుల ముందు ఆ బాలుడు బోరున విలిపించాడు.
వివరాలు తెలుసుకున్న ఎస్సై అనిల్ రెడ్డి బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ మధ్య ఏమైనా గొడవలుంటే పిల్లలపై మీ ప్రతాపం చూపిస్తారా.. అంటూ ఎస్సై తల్లితండ్రులను నిలదీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకూడదన్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి సూచించారు ఎస్సై.