మాస్క్ మహారాజ్: రూ.11 కోట్లతో మాస్క్ తయారు చేయించుకుంటున్న వ్యాపారి…

  • Published By: nagamani ,Published On : August 10, 2020 / 03:45 PM IST
మాస్క్ మహారాజ్: రూ.11 కోట్లతో మాస్క్ తయారు చేయించుకుంటున్న వ్యాపారి…

మాస్క్ మహారాజ్ : రూ. 11 కోట్లతో వజ్రాల మాస్క్ తయారు చేయించుకుంటున్న వ్యాపారి…
కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న క్రమంలో నిత్యం అవసరమయ్యే సాధారణ మాస్క్ లు కొనటానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కానీ శ్రీమంతులు మాత్రం అందరిలా మామూలు మాస్క్ లు పెట్టుకుంటే మా స్పెషాలిటీ ఏంటీ..మా స్టేటస్ కు తగినట్లు దర్పాన్ని చూపించుకోవాలిగా అనుకుంటు..లక్షలు కోట్ల రూపాలు ఖర్చు పెట్టి తయారు చేయించుకుంటున్నారు. వీటిని తయారు చేసేవాళ్లు కూడా అదే స్టైల్ లో తమదైన స్టేటస్ లో తయారు చేస్తున్నారు.



తాజాగా..అమెరికాలో ఉంటున్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును పెట్టుకోవాలనుకున్నాడు. నా స్థాయికి తగినట్లుగా ఉండాలనుకున్నాడు. ఆ మాస్క్ తయారీ కోసంఇజ్రాయెల్ లోని జెరూసలేంలో ఉన్న వైవెల్ ఆభరణాల సంస్థలో ఆర్డర్ చేశాడు.ఖరీదు ఎంతైనా ఫరవాలేదు..ఎన్ 99 ఫిల్టర్లు, బంగారం, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని చెప్పాడు.



దాని ఖరీదు సుమారు రూ. 11.2 కోట్లని జ్యూవెలరీ సంస్థ తెలిపింది. ఈ మాస్క్ ను 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేస్తున్నామని, మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వైవెల్ సంస్థ యజమానీ..మాస్క్ డిజైనర్ ఐజాక్ లెవీ తెలిపారు. జ్యులరీ సంస్థ చెప్పింది. హా..ఖరీదు ఎంతైతే ఏంటీ..నా స్టేటస్ ఆ మాస్క్ లో కనిపించాలని రూ.11.2 కోట్లు ఖర్చు పెట్టి ఆ మాస్క్ తయారు చేయించుకుంటున్నాడు. కాకపోతే ఈ మాస్క్ తయారీ పూర్తి కావటానికి కాస్త టైమ్ పడుతుందని జెరూసలేం ఆభరణాల సంస్థ తెలిపింది.