CM Jagan : రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి పెట్టాలి : సీఎం జగన్

రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.

CM Jagan : రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి పెట్టాలి : సీఎం జగన్

Cm Jagan (1)

CM Jagan’s review : రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై గురువారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలని సూచించారు. జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు.

రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందేలా చేయడం ఒక బాధ్యత అయితే, ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపైనా కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని వెల్లడించారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. మున్సిపల్, విద్యుత్‌ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. సరైన కార్యాచరణ ద్వారా ప్రజలకు చక్కగా సేవలు అందుతాయని, ఆదాయాలు కూడా పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలన్నారు.