Raj Kundra Case : యూజర్ల కోసం, డబ్బు సంపాదనే లక్ష్యంగా అశ్లీల చిత్రాలను తీయాలనుకున్నాడు
యాప్ యూజర్లు మూడు రెట్లు పెంచుకోవడమే లక్ష్యంగా శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్లాన్ చేశాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.
Raj Kundra Business Plan: యాప్ యూజర్లు మూడు రెట్లు పెంచుకోవడమే లక్ష్యంగా శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్లాన్ చేశాడని, రెండేండ్లలో 8రెట్ల లాభం పొందాలని భావించాడని, 119 అశ్లీల చిత్రాలను నిర్మించి, రూ.8.84 కోట్లకు అమ్మాలని అనుకున్నట్లు చార్జిషీట్లో పెట్టారు అధికారు. రాజ్ కుంద్రా ఫస్ట్ యాప్ బ్యాన్ అవ్వగా.. మరో యాప్ను రూపొందించాడని, డిజిటల్ మీడియాను ఉపయోగించుకుని అక్రమంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేసినట్లుగా గుర్తించారు.
అశ్లీల చిత్రాల విషయం బయటపడిన తర్వాత డేటాను సీక్రెట్గా పెట్టుకునే ప్రయత్నం చేశారని, కుదరకపోవడంతో డిలేట్ చేసి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఈ విషయాలను ముంబై పోలీసులు చార్జిషీట్లో వెల్లడించారు. మడ్ ఐల్యాండ్లోని ఓ భవంతిపై పోలీసులు దాడులు జరిపిన సందర్భంలో అశ్లీల చిత్రాల నిర్మాణం విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
రాజ్ కుంద్రా సంస్థలో పనిచేస్తున్న ఉమేష్ కామత్ అనే వ్యక్తి అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని లండన్లోని రాజ్ కుంద్రా బామ్మర్ది ప్రదీప్ బక్షికి పంపేవాడని, అక్కడ ఉమేశ్ కామత్ అశ్లీల చిత్రాలను యాప్లో అప్లోడ్ చేసేవాడని పోలీసులు చెప్పారు. ఛార్జ్షీట్ ప్రకారం, ‘హాట్షాట్’ యాప్ ఖాతా, ‘హాట్షాట్’ టేక్ డౌన్ అనే రెండు వాట్సాప్ గ్రూపులు ఉమేష్ మొబైల్లో గుర్తించారు.
ఈ రెండు గ్రూపులకు అడ్మిన్ కూడా ఉమేశ్ కామతే. పూర్తి విచారణ అనంతరం మొత్తం రాకెట్కు సూత్రధారి రాజ్ కుంద్రా అని పోలీసులు గుర్తించారు. ఈ పనులన్నీ చట్టవిరుద్ధమని రాజ్ కుంద్రాకు తెలిసినందునే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు చార్జిషీట్లో చెప్పారు.