Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీ లోని కోనసీమ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యానాం-ఎదుర్లంక వంతెన మీద వేగంగా వెళుతున్న ఇసుక లారీ ముందు బైక్ పై వెళుతున్న ఫ్యామిలీని
Road Accident : ఏపీ లోని కోనసీమ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యానాం-ఎదుర్లంక వంతెన మీద వేగంగా వెళుతున్న ఇసుక లారీ ముందు బైక్ పై వెళుతున్న ఫ్యామిలీని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న భార్య,భర్త,కుమారుడు అక్కడికక్కడే మరణించగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Karnataka : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి…తెలుసుకున్న భార్య … ?