AP Cm Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫిల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది.
![AP Cm Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా.. AP Cm Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..](https://10tv.in/wp-content/uploads/2022/11/YS-JaganMohan-Reddy.jpg)
YS JaganMohan Reddy
AP Cm Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10.30 గంటలకు గుమ్మళ్లదొడ్డి చేరుకుంటారు. ఉదయం 10.45 గంటల నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుప్రయాణం అవుతారు.
AP CM Jagan: చంద్రబాబు హైదరాబాద్కు లోకల్.. కుప్పంకు నాన్ లోకల్ ..
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫిల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది.