AICC: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జుల్లో మార్పులు
నూతనంగా నియామకైన వారు తక్షణమే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.
AICC: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులను అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకు ఉన్న కో-ఇంచార్జులుగా ఉన్న బోసురాజు, నదీమ్ జావేద్లను ఏఐసీసీ రిలీవ్ చేసింది. వారి స్థానంలో మన్సూల్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్లను నియమించారు. నూతనంగా నియామకైన వారు తక్షణమే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.