BRS List: రాజయ్యకు మొండిచేయి.. రేఖా నాయక్ కు షాక్

ముందుగా చెప్పినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే ఏడుగురు సిట్టింగులకు మాత్రం ఫిట్టింగ్ పెట్టారు.

BRS List: రాజయ్యకు మొండిచేయి.. రేఖా నాయక్ కు షాక్

thatikonda rajaiah, rekha naik dropped from brs list

BRS List: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ప్రకటించారు. ముందు నుంచి ఊహించినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ (CM KCR) పెద్దపీట వేశారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. అన్నివిధాలుగా ఆలోచించిన తర్వాతే వీరిని తప్పించినట్టు బీఆర్ఎస్ బాస్ తెలిపారు. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయలేదు. మూడు నాలుగు రోజుల్లో ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

ఉప్పల్, వేములవాడ, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్ పూర్, వైరా స్థానాల్లో సిట్టింగ్ లకు చోటు దక్కలేదు. కామారెడ్డి నుంచి తానే బరిలోకి దిగుతున్నా కాబట్టి అది మార్పు కిందకు రాదని కేసీఆర్ అన్నారు. ఈ సీటును కూడా కలుపుకుంటే మొత్తం 8 మంది సిట్టింగులను చోటు దక్కలేదని భావించాల్సి ఉంటుంది. ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి టిక్కెట్ దక్కించుకున్నారు. వివాదాస్పదంగా మారిన జనగాం, నర్సాపూర్ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. గోషామహల్, నాంపల్లి స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు.

బొంతు రామ్మోహన్ మరోసారీ
ముందుంచి ఊహించినట్టుగా స్టేషన్ ఘన్ పూర్ లో తాటికొండ రాజయ్యకు చుక్కెదురైంది. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు. పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ను కూడా పక్కనపెట్టారు. ఉప్పల్ స్థానంలో బేతి సుభాశ్ రెడ్డిని తప్పించి బండారు లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి టిక్కెట్ ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను మరోసారి ఆశభంగం ఎదురైంది.

Also Read: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే.. 2 స్థానాల్లో కేసీఆర్ పోటీ

రేఖా నాయక్ కు షాక్
ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తన స్థానాన్ని నిలుపుకోలేకపోయారు. ఇక్కడ భూక్యా జాన్సన్ రాథోడ్ కు అవకాశం ఇచ్చారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టిక్కెట్ దక్కించులేకపోయారు. కోవా లక్ష్మికి ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కించుకున్నారు. వైరాలో బానోతు మదన్ లాల్, బోధ్ నుంచి అనిల్ జాదవ్ టిక్కెట్లు పొందారు. కాగా, రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.