ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy : సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. కాగా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.

Also Read : భార్యకోసం రోజుకు 320 కి.మీ ప్రయాణిస్తున్న భర్త.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఇదిలాఉంటే తెల్లవారు జామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు అలయ అర్చకులు నిర్వహించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి బోనాల పండగ సంప్రదాయం ఉందని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు.

Also Read : ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు: రేవంత్ రెడ్డి