Delhi : బిర్యానీ కోసం యువకుడిని హత్య చేసిన బాలుడు .. మృతదేహం పక్కనే డ్యాన్స్

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. బిర్యాని తినటానికి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశాడు ఓ బాలుడు.

Delhi : బిర్యానీ కోసం యువకుడిని హత్య చేసిన బాలుడు .. మృతదేహం పక్కనే డ్యాన్స్

Delhi

Delhi Crime : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. బిర్యాని తినటానికి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశాడు ఓ బాలుడు. ఒకటి కాదు రెండుసార్లు కాదు ఏకంగా కత్తితో 60 సార్లు పొడిచి చంపిన ఘటన ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.350ల కోసం ఈ హత్య చేసినట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలోని స్వాగత్ ప్రాంతంలో గత మంగళవారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటకొచ్చింది. ని జంతా మజ్ధూర్ కాలనీలో దారి వెంట వెళుతున్న ఓ యువకుడిపై 16 ఏళ్ల బాలుడు దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. దాదాపు 60సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపాడు. తరువాత అతని జేబులో రూ.350లు తీసుకున్నాడు. బాధితుడు ప్రాణాలు కోల్పోవటంతో అతని మృతదేహం పక్కనే నిలబడి సదరు బాలుడు డ్యాన్స్ చేసినట్లుగా వీడియోలో రికార్డు అయ్యింది.

కాగా ఆ ప్రాంతంలో హత్య జరిగిందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా హత్య చేసిన బాలుడు మృతదేహం పక్కనే డ్యాన్స్ వేసినట్లుగా గుర్తించారు. డబ్బుల కోసమే హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు.

ఈ దారుణ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ మాట్లాడుతు..ఓ మైనర్ దారి వెంట వెళ్లే వ్యక్తిపై కత్తితో పైశాచికంగా దాడి చేసిన హత్య చేశాడని తెలిపారు. ఈ దారుణమంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యిందని..డబ్బుల కోసమే హత్య చేసినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. అనంతరం అతడిని విచారించగా బిర్యానీ తినేందుకు డబ్బుల కోసం హత్య చేశాడని బాధితుడి నుంచి రూ.350 తీసుకున్నాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని..ఫోరెన్సిక్ బృందాలు నేరానికి సంబంధంచిన వివరాలు సేకరిస్తున్నాయని వెల్లడించారు.