Payal Ghosh : ఇర్ఫాన్తో 5 ఏళ్లు డేటింగ్లో ఉన్నాను.. గంభీర్ నా మీద ఇంట్రెస్ట్ చూపించాడు.. క్రికెటర్లపై ఆ నటి సంచలన వ్యాఖ్యలు
నటి పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో తన ట్వీట్స్తో సంచలనం సృష్టిస్తుంటారు. ఇద్దరు క్రికెటర్ల గురించి తాజాగా పాయల్ పెట్టిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి.
![Payal Ghosh : ఇర్ఫాన్తో 5 ఏళ్లు డేటింగ్లో ఉన్నాను.. గంభీర్ నా మీద ఇంట్రెస్ట్ చూపించాడు.. క్రికెటర్లపై ఆ నటి సంచలన వ్యాఖ్యలు Payal Ghosh : ఇర్ఫాన్తో 5 ఏళ్లు డేటింగ్లో ఉన్నాను.. గంభీర్ నా మీద ఇంట్రెస్ట్ చూపించాడు.. క్రికెటర్లపై ఆ నటి సంచలన వ్యాఖ్యలు](https://10tv.in/wp-content/uploads/2023/12/New-Project-9.jpg)
Payal Ghosh
Payal Ghosh : బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఇద్దరు భారత క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్తో 5 ఏళ్లు డేటింగ్ చేసానని.. గౌతమ్ గంభీర్ తనతో డేటింగ్ చేయడానికి ఆసక్తి చూపాడని పాయల్ చెప్పడం సంచలనంగా మారింది.
Malavika Mohanan : ఎవరైనా నా చేయి పట్టుకోండి.. ఆ హీరోయిన్ పోస్టు వైరల్
నటి పాయల్ ఘోష్ తాజాగా ట్విట్టర్లో చాలా ఆవేదనతో పోస్టు పెట్టారు. 2011 నుండి ఐదేళ్ల పాటు ఇర్ఫాన్ పఠాన్తో తాను డేటింగ్ చేసానంటూ బాంబు పేల్చారు పాయల్. అక్షయ్ కుమార్, గౌతమ్ గంభీర్ కూడా తన ముందు ఉన్నా ఇర్ఫాన్ను మాత్రమే ప్రేమించానని.. గౌతమ్ గంభీర్ నుండి మిస్డ్ కాల్స్ వచ్చేవని పాయల్ తన ట్వీట్ లో రాసారు. ఈ విషయం ఇర్ఫాన్కి తెలుసునని తన కాల్ లిస్ట్ ఎప్పుడూ చెక్ చేసేవాడని.. తన సోదరుడు యూసుఫ్ పఠాన్, హార్దిక్, కృనాల్ పాండ్యా ముందు కూడా చెప్పాడని ఆమె రాసారు. అయితే అక్షయ్ కుమార్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని అతనో పెద్ద స్టార్ అని.. అతనిని తను ఎప్పుడూ గౌరవిస్తానని పాయల్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
ఇర్ఫాన్తో విడిపోయిన తర్వాత పాయల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. ఈ విషయాన్ని కూడా తన ట్వీట్ లో ప్రస్తావించారు ఈ నటి. కొన్ని సంవత్సరాల పాటు పనిచేయలేదని రాసారు. తను ప్రేమించిన ఏకైక వ్యక్తి ఇర్ఫాన్ అని ఆ తర్వాత తను ఎవరినీ ప్రేమించలేదని రాసారు పాయల్. పాయల్ సోషల్ మీడియా వేదికలో రాసుకొచ్చిన ఈ ట్వీట్స్ సంచలనంగా మారాయి.
Salaar Trailer : సలార్ ట్రైలర్ ఎన్ని నిముషాలు ఉండబోతుందో తెలుసా? రెబల్ స్టార్ ఫ్యాన్స్కి పండగే..
పఠాన్ భారత్ తరపున మొత్తం 29 టెస్టు మ్యాచ్ లు, 120 వన్డేలు, 24 టీ 20 లు ఆడాడు. గౌతమ్ గంభీర్ 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో గంభీర్ 154 మ్యాచ్లు ఆడాడు. తన ఐపీఎల్ కెరియర్లో 491 ఫోర్లు, 59 సిక్సర్లు కొట్టాడు. కోల్కతాకు చెందిన పాయల్ ఘోష్ తెలుగు సినిమాల్లో కూడా నటించారు. జూనియర్ ఎన్టీఆర్తో ‘ఊసరవెల్లి’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించారు. అటు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్న ఈమె రామ్ దాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
After we broke up … I fell ill .. I couldn’t work for years… but he was the only guy whom I loved… after that I never loved anybody 🥲 pic.twitter.com/vKRYWJl0Ti
— Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023