Parthasarathy : ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్.. న్యూజివీడు నుంచి ఎన్నికల బరిలోకి

వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీ గూటికి చేరనున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది.

Parthasarathy : ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్.. న్యూజివీడు నుంచి ఎన్నికల బరిలోకి

Parthasarathy

MLA Parthasarathy To Join TDP : వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరనున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 26న ప్రార్థసారధి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆరోజు నూజివీడుకు చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు సమక్షంలో పార్థసారధితోపాటు ఇతర నేతలు టీడీపీలో చేరనున్నారు. పార్థసారధి బరిలోకి దిగే నియోజకవర్గాన్ని సైతం టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది. నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పార్థసారధి బరిలోకి దిగనున్నారు. ఏలూరు జిల్లా న్యూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్థసారధి దాదాపు ఖరారు కావడంతో నూజివీడు పట్టణంలో ప్లెక్సీలు వెలిశాయి. పార్థసారధికి స్వాగతం పలుకుతూ కొందరు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Also Read : Minister Botsa Satyanarayana : పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బొత్స క్లారిటీ

కృష్ణా జిల్లాలోని పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగాఉన్న పార్థసారధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సీటు కేటాయించలేదు. ఆ నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేశ్ బరిలోకి దిగనున్నారు. పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా జోగి రమేశ్ ను జగన్ ఖరారు చేశారు. అంతకుముందు నుంచే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థ సారధి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. గత నెలరోజులుగా ఆయన వైసీపీ వీడి టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే, టీడీపీలోకి వెళ్తే ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారనే విషయంపై క్లారిటీ లేకపోవటంతో ఇన్నిరోజులు టీడీపీలో చేరికను పార్ధసారధి వాయిదా వేసుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది.  చంద్రబాబు తాజాగా పార్థసారధి ఎన్నికల బరిలోకి దిగే నియోజకవర్గంపై క్లారిటీ ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరికకు ముహూర్తం ఖారారు చేసుకున్నారు.

Also Read : నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్

ఈనెల 26న నూజివీడులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్ధసారధి, ఆయన వర్గీయులు టీడీపీలో చేరనున్నారు. నూజివీడు నుంచే ఆయన మరో రెండు మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నిల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ విషయంపై చంద్రబాబు నుంచి స్పష్టత వచ్చినట్లు పార్ధసారధి వర్గీయులు పేర్కొంటున్నారు.