Varun Tej : టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్తో.. ఒక మంచి పని జరిగిందంటే.. అది వరుణ్ వల్లే.. ఏంటది..!
టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్తో ఏదైనా మంచి జరిగిందంటే, అది వరుణ్ తేజ్ వల్లే అంటున్నారు నెటిజెన్స్. ఇంతకీ ఆ మంచి పని ఏంటి..?
Varun Tej : టాలీవుడ్ లో ఎప్పటికి అప్పుడు ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంటుంది. ఇక ఈమధ్య స్టార్ట్ అయిన ట్రెండ్ ఏంటంటే.. పలానా హీరో, హీరోయిన్ తమ వీడియో పై రియాక్ట్ అయితే ఆడియన్స్ తమ కెరీర్ లేదా స్టడీస్ పై ఫోకస్ పెడతానంటూ పోస్టులు వేయడం. విజయ్ దేవరకొండ అభిమానితో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత విశ్వక్ సేన్, మృణాల్ ఠాకూర్.. ఇలా ఒక్కక్కరిగా ఆ ట్రెండ్ పాస్ అవుతూ వచ్చింది.
రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఈ ట్రెండ్ ని ఫేస్ చేశారు. ఈ హీరో నటించిన తాజా మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ గత వారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఒక లేడీ అభిమాని తన ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్టు చేస్తూ.. “వరుణ్ తేజ్ గారు ఈ వీడియో పై కామెంట్ చేస్తే, నేను 200 అనాథ పిల్లలకు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షో ఏర్పాటు చేయిస్తా” అంటూ రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్టు చూసిన వరుణ్ తేజ్ రియాక్ట్ అవుతూ.. “ఎంత మంచి ఆలోచన. అయితే అనాథ పిల్లలకు ఆ స్పెషల్ షో నేనే ఏర్పాటు చేయిస్తా. నా టీం నిన్ను సంప్రదించి, నీ సూచనలతో ఆ షో ఏర్పాటు అయ్యేలా. నీకు గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంలా చేస్తాము” అంటూ వరుణ్ కామెంట్ చేశారు. అలా కామెంట్ చేయడమే కాదు, చెప్పినట్లు షో కూడా ఏర్పాటు చేసి వరుణ్ తన గొప్ప మనసుని చాటుకున్నారు.
ఇక ఈ విషయాన్ని గమనించిన టాలీవుడ్ ఆడియన్స్.. “ఈ కొత్త ట్రెండ్ వల్ల ఏదైనా మంచి జరిగిందంటే, అది వరుణ్ తేజ్ వల్లే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘ఆపరేషన్ వాలంటైన్’ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పుల్వామా అటాక్ కథాంశంతో తెరకెక్కింది. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
View this post on Instagram