Mudragada : ఈనెల 14న వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

Mudragada : ఈనెల 14న వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం!

Mudragada Padmanabham

Mudragada Padmanabham Into YCP : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ముద్రగడ వెంట ఆయన కుమారుడు గిరిబాబుతో పాటు పలువురు కాపు సంఘం నేతలు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిర్లపూడి నుంచి భారీ సంఖ్యలో అనుచరులతో తాడేపల్లికి తరలివెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముద్రగడ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇటీవల కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఆయనతో వైసీపీ సీనియర్ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో వైసీపీలో చేరతానని వారికి ముద్రగడ హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఎలాంటి పదవులు ఆశించకుండా, పార్టీకి తన సేవలు అందిస్తానని వైసీపీ నేతలకు ముద్రగడ చెప్పినట్లు సమాచారం.

Also Read : CM Jagan : అద్దంకిలో వైసీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించే చాన్స్?

ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే, ఆయన సేవలను వైసీపీ అధిష్టానం ఏ విధంగా ఉపయోగించుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో ముద్రగడ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఏపీలోని కాపు ఓటర్లు పవన్ కల్యాణ్ వైపు మొగ్గుచూపకుండా వైసీపీ ముద్రగడ పద్మనాభవం సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ముద్రగడ పద్మనాభంకు ప్రచార బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి గిరిబాబు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడకు నామినేటెడ్ పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ముద్రగడ పార్టీలో చేరిన తరువాత అన్నిఅంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read : Telangana Congress : ఒకే ఛాన్స్..! టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో కొత్త రూల్‌..!

ముద్రగడ పద్మనాభం పత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పద్మనాభం ఓసారి ఎంపీగా కూడా విజయం సాధించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి హయాంలలో మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ముద్రగడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముద్రగడ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.