ఏపీలో ఒకేరోజు 465 కరోనా కేసులు, నాలుగు మరణాలు

ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 465 కరోనా కేసులు, 4 మరణాలు

  • Published By: naveen ,Published On : June 19, 2020 / 09:16 AM IST
ఏపీలో ఒకేరోజు 465 కరోనా కేసులు, నాలుగు మరణాలు

ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 465 కరోనా కేసులు, 4 మరణాలు

ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 465 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 376 కేసులున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,961కి చేరింది. మొత్తం 17,609 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 96కి పెరిగింది. ఏపీలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

1

Read: రాజ్యసభ ఎన్నికలు.. ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, టీడీపీ నుంచి ముందుగా ఓటు వేసిన బాలకృష్ణ