Tragedy : తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి

 చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

Tragedy : తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి

Boy Dead

boy died falling into floodwaters : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం కలిగించింది.

పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం గ్రామానికి చెందిన శ్రీరాములు.. అతని కుమారులు అరుణ్‌, తేజశ్‌తో కలిసి ఏరు దాటుతుండగా ప్రమాదం జరిగింది. తండ్రి, ఇద్దరు కొడుకులు ఏరు దాటుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురూ వరదలో కొట్టుకుపోయారు.

Kondapalli : హైకోర్టు తీర్పు మీదే ఆధారపడ్డ కొండపల్లి చైర్మన్ ఎన్నిక..!

అయితే పోలీసులు తండ్రి శ్రీరాములు, పెద్దకొడుకు అరుణ్‌ను రక్షించారు. కాగా తేజశ్‌ అనే నాలుగేళ్ల చిన్న కొడుకు వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.