AP Covid-19 Update : ఏపీలో మళ్లీ 200 దాటిన కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి మొన్న 156 కేసులు నమోదు కాగా, నిన్న 208 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
AP Covid-19 Update : ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి మొన్న 156 కేసులు నమోదు కాగా, నిన్న 208 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
నిన్న కోవిడ్ నుంచి 247 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల 086 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 69వేల 978 కి చేరింది. వీరిలో 20 లక్షల 52 వేల 477 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
Also Read : Weather Forecast : తెలంగాణలో వర్షాలు, ఆంధ్రాకు తుపాను హెచ్చరికలు
ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా,గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కోక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 415 కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 2 కోట్ల 99లక్షల 83వేల 209 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.