CM Jagan : జగన్ ప్రభుత్వం శుభవార్త… 46లక్షల మందికి లబ్ది

జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా..

CM Jagan : జగన్ ప్రభుత్వం శుభవార్త… 46లక్షల మందికి లబ్ది

Cm Jagan

CM Jagan : జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 46.61 లక్షల మందికి పైగా పేదలు లబ్ది పొందబోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకంటూ సొంత ఆస్తిని అందుకోబోతున్నారు.

Google Pay: అనుమానస్పదంగా మారిన గూగుల్ పే ప్రైవసీ

ఈ వన్ టైమ్ సెటిల్ మెంట్ ను గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలుగా, మున్సిపాల్టీల్లో రూ.15వేలుగా, నగరపాలక సంస్థల పరిధిలో రూ.20వేలుగా నిర్ణయించారు. నిర్ణీత మొత్తాల్ని డిసెంబర్ 30లోగా చెల్లిస్తే, ప్రస్తుతం ఉంటున్న ప్రభుత్వ ఇల్లు లేదా అనుభవిస్తున్న ప్రభుత్వ స్థలాన్ని తమ పేరిట ప్రైవేటు ఆస్తిగా లబ్దిదారులు మార్చుకోవచ్చు.

ప్రభుత్వం నుంచి స్థలం పొంది, సొంత డబ్బుతో ఇల్లు కట్టుకున్న లబ్దిదారులకు ఎలాంటి వన్ టైమ్ సెటిల్ మెంట్ ఉండదు. వాళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తారు.

ఇల్లు కట్టించి ఇవ్వడమే కాకుండా, ఆ ఇంటిని వ్యక్తిగత ఆస్తిగా మార్చి పేదలను ధనవంతుల్ని చేస్తానని గతంలోనే సీఎం జగన్ మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని అమలు చేసే దిశగా తీర్మానం చేశారు.

Horror మూవీలను భయపడకుండా చూస్తే.. ఈ కంపెనీ రూ. 95,500 చెల్లిస్తానంటోంది!

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇళ్లు కుదువపెట్టిన వారి కోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని చెప్పారు.

1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందిన పేదలు రుణం కోసం హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర తనఖా పెట్టి తీసుకున్న అప్పు అసలు రూ.9,320 కోట్లు కాగా, దానికి ఇప్పటివరకు వడ్డీ రూ.5,289 కోట్లు అని వివరించారు. ఈ రుణాన్ని వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా పరిష్కరించి పేదలకు లబ్ది చేకూర్చాలని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, మున్సిపల్ కార్పొరేషన్ లలో రూ.20వేలు చెల్లించాల్సి ఉందన్నారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు..
* ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమ తొలగించేందుకు ఆమోదం.
* ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమ స్థాపించేందుకు ఎల్జీ పాలిమర్స్ కు అనుమతి.
* మైనారిటీ సబ్ ప్లాన్ కు ఆమోదం.
* రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియామకం చట్టసవరణకు మంత్రివర్గ ఆమోదం.
* కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో కలిసి సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు.
* సెకీతో కలిసి 10 వేల మెగావాట్ల ప్లాంట్.
* ఈ 10 వేల మెగావాట్లు వ్యవసాయ రంగానికే వినియోగించాలని నిర్ణయం.
* యూనిట్ రూ.2.49 చొప్పున సరఫరా చేసేందుకు క్యాబినెట్ ఆమోదం.
* రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్టీసీకి బదలాయించేందుకు ఆమోదం.
* వైఎస్సార్ ఆసరా పథకానికి క్యాబినెట్ ఆమోదం.
* గృహ నిర్మాణానికి రూ.35వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి ఆమోదం.