Jagananna Vidya Deevena: ఎన్టీఆర్ జిల్లాకు సీఎం జగన్‌.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమకానున్న జగనన్న విద్యా దీవెన నిధులు

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద గతేడాది అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో కంప్యూటర్‌లో బటన్ నొక్కడం ద్వారా జగన్ నేరుగా 9.86లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 698.68 కోట్లు జమ చేయనున్నారు.

Jagananna Vidya Deevena: ఎన్టీఆర్ జిల్లాకు సీఎం జగన్‌.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమకానున్న జగనన్న విద్యా దీవెన నిధులు

AP CM Jagan

Jagananna Vidya Deevena: ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం భోజన, వసతి ఖర్చుకోసం ప్రతీయేటా రెండు వాయిదాల్లో ఆర్థిక సాయం అందిస్తోన్న విషయం విధితమే. ఈ నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుంది. ఈ క్రమంలో ఈ పథకంకు సంబంధించి గతేడాది అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ఆదివారం సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ కంప్యూటర్‌లో బటన్ నొక్కడం ద్వారా నేరుగా 9.86లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 698.68 కోట్లు జమ చేయనున్నారు.

Jagananna Vidya Deevena: పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు.. విద్యార్థుల ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది.

సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10.35 గంటలకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. ఉదయం 11గంటల నుంచి 12.30 గంటల వరకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత చదువులకోసం అమలుచేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకంకు సంబంధించి నిధులను విడుదల చేస్తారు. కంప్యూటర్ లో బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ నగదు జమ అవుతాయి. అనంతరం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. కార్యక్రమం పూర్తయిన తరువాత తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ వెళ్తారు.

Jagananna Vidya Deevena : విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

ప్రతీయేటా రెండు దఫాలుగా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తున్న విషయం విధితమే. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 13,311 కోట్లు సాయం అందించిన విషయం విధితమే.