ఏపీలో ఒక్కరోజే 8 కరోనా మరణాలు, 9వేల 834కి చేరిన కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24
ఏపీలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24
ఏపీలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 462 పాజిటివ్ కేసులు వచ్చాయి. కోవిడ్ కారణంగా మరో 8మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 119 మందికి చేరింది. కొత్తగా నమోదైన 462 కేసుల్లో.. రాష్ట్రానికి చెందిన కేసులు 407. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో 15 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7,858 చేరినట్లుగా హెల్త్ బులిటెన్ లో తెలిపారు.
ఏపీలో 4,173 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,566 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 20వేల 639 శాంపిల్స్ పరీక్షించగా 462మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 129మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,834కు చేరింది. ఈ లెక్కన చూస్తే 5,123 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,592 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు కరోనాతో మరణించారు.
#COVIDUpdates: 23/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7858 పాజిటివ్ కేసు లకు గాను
*3566 మంది డిశ్చార్జ్ కాగా
*119 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4173#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/mNNdXlbVbs— ArogyaAndhra (@ArogyaAndhra) June 23, 2020