Agri Gold Case : అగ్రి గోల్డ్ కేసులో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం

అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్ కేసులలో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాలను ఏలూరు లోని జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను హై కోర్టు ఏలూరు క

Agri Gold Case : అగ్రి  గోల్డ్ కేసులో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం

AP high court agri gold case

Agri Gold Case :  అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్ కేసులలో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాలను ఏలూరు లోని జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వేలం  ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను హై కోర్టు ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది.

గత ఏడేళ్లుగా ఈ రెండు కేసులు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్నాయి. హై కోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల అభ్యర్ధనను కోర్టు తిరిస్కరించింది.  ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఈ కేసులను ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది.
Also Read : Goa Liquor Seized :10 లక్షల రూపాయల విలువైన గోవా మద్యం స్వాధీనం
హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టును ఆదేశిస్తూ…అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ సంబంధించిన కేసులన్నింటిపై   హైకోర్టులో విచారణ ముగించింది.