AP Corona : ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37వేల 540 మందికి కరోనా పరీక్షలు చేయగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

AP Corona : ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 37వేల 540 మందికి కరోనా పరీక్షలు చేయగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 37, విశాఖ జిల్లాలో 36, కృష్ణా జిల్లాలో 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 33, గుంటూరు జిల్లాలో 30 కేసులు వెలుగుచూశాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!

అదే సమయంలో 307 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,352 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,51,747 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 14వేల 409కి పెరిగింది. 3వేల 196 యాక్టివ్ కేసులు ఉన్నాయి.