AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి.

AP Corona : ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 నమూనాలు పరీక్షించగా.. 567 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 8 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు.. కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు మరణించారు.
Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..
ఒక్క రోజు వ్యవధిలో 437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,854 కి చేరింది. రికవరీ కేసులు 20,45,713 కు పెరగగా.. కరోనా మృతుల సంఖ్య 14,364 కి ఎగిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,93,65,385కు చేరింది.
Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?
తాజాగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు.
కాగా, దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా లేదనే భావనలో ప్రజలు ఉన్నారు. కరోనా నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. మాస్క్ లేకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలాగే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే థర్డ్ వేవ్ ముప్పు త్వరలోనే విరుచుకుపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ మొదలైంది. రష్యా, బ్రిటన్లో కేసులు, మరణాలు అమాంతం పెరిగాయి. చైనాలోనూ వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో త్వరలోనే భారత్లోనూ థర్డ్ వేవ్ ముప్పు ఉండనుందా? అనే భయాందోళన వ్యక్తమవుతోంది. అలాగే అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు మళ్లీ యధావిధిగా నడుస్తున్నాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్లు భారత్లోకి ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
#COVIDUpdates: 27/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసు లకు గాను
*20,42,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,364 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eU46dLwblh— ArogyaAndhra (@ArogyaAndhra) October 27, 2021
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్లో టెన్షన్.. ఎందుకో తెలుసా?