AP Corona Cases : ఏపీలో తగ్గిన కరోనా కేసులు
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో..
AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపించింది. వరుసగా రెండో రోజు వందకి లోపే కొత్త కేసులు వెలుగుచూశాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 27వేల 233 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 95 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,481కి పెరిగింది.
అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,60,061 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 1,432 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Whatsapp : వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!
కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా జాగ్రత్తగా ఉండాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నారు.
కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు.
#COVIDUpdates: 21/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,079 పాజిటివ్ కేసు లకు గాను
*20,57,166 మంది డిశ్చార్జ్ కాగా
*14,481 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,432#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/RKLRvYLw1q— ArogyaAndhra (@ArogyaAndhra) December 21, 2021