Sailajanath : ఏపీలో పాదయాత్ర చేపట్టనున్న శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయపార్టీ నేత ఇప్పుడు పాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రవలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్

Sailajanath : ఏపీలో పాదయాత్ర చేపట్టనున్న శైలజానాథ్

Sailajanath

Sailajanath :  ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయపార్టీ నేత ఇప్పుడు పాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రవలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

100 రోజుల్లో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు… క్యాడర్ లో నూతన ఉత్సాహం నింపేందుకే పాదయాత్ర చేపడుతున్ననట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపాయి. పాదయాత్ర చేస్తున్న గ్రామాలలో దారి పోడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉదయం,సాయంత్రం బహిరంగసభలు ఉండేలా కార్యక్రమాన్నిరూపోందిస్తున్నారు.
Also Read : Jobs : తెలంగాణ జ్యూడీషియల్ సర్వీసెస్ లో పోస్టుల భర్తీ
మే చివరి వారంలో అనంతపురం లేదా శ్రీకాకుళం నుంచి పాదయాత్ర మొదలు పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే శైలజానాధ్ పాదయాత్ర పై పూర్తిస్ధాయిలో దృష్టిపెట్టి కార్యక్రమాన్నిఆచరణలో పెట్టనున్నారు.