Bonda Uma Maheshwar Rao : శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం.. బోండా ఉమా సంచలన ఆరోపణలు

కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.

Bonda Uma Maheshwar Rao : శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం.. బోండా ఉమా సంచలన ఆరోపణలు

Uma Maheshwar Rao

Tirumala Srivani Trust : తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టు నిధులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. టీటీడీని ఓ ఆదాయ వనరుగా మార్చారని విమర్శించారు. లడ్డూ ధరలు పెంచారని, గదుల అద్దెలని పెంచేశారని పేర్కొన్నారు.

కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చే నిధులపై అనేక అనుమానాలు ఉంటున్నాయని తెలిపారు. శ్రీవాణి టిక్కెట్లను ఆఫ్ లైన్ లో అమ్ముతున్నారని వెల్లడించారు. సామాన్యులు వెళ్లే రూ. 300 టిక్కెట్లకు ఆఫ్ లైన్ సదుపాయం లేదన్నారు. కానీ, రూ. 10 వేల ధర ఉన్న శ్రీవాణి టిక్కెట్లను ఆఫ్ లైన్ లో ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల.. రూ. 861 కోట్ల విరాళాలు

కొన్ని ఎయిర్ పోర్టులు, కొన్ని కొండపై, మరికొన్ని ఆన్ లైన్ లో శ్రీవాణి టిక్కెట్లను అమ్ముతున్నామని చెబుతున్నారని తెలిపారు. రోజుకూ వేయి టిక్కెట్లే అమ్ముతున్నారో.. 1500 టిక్కెట్లు అమ్ముతున్నారో ఎవరికి తెలుసని అని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పిన లెక్కల ప్రకారమే రోజుకు వేయి టిక్కెట్లు అమ్మితే.. నాలుగేళ్లల్లో సుమారు రూ. 1500 కోట్లు రావాలని తెలిపారు. కానీ, శ్వేతపత్రంలో మాత్రం రూ. 860 కోట్లే అంటున్నారని పేర్కొన్నారు. శ్రీవాణి పేరుతో సగం డబ్బులు కొట్టేశారా ? అని ప్రశ్నించారు.

శ్రీవాణి ట్రస్టు నిధులు సుమారు రూ. 700 కోట్లను తాడేపల్లి దేవస్థానానికి తరలించారా? అని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేల రాజకీయం కోసం శ్రీవాణి నిధులను వెచ్చిస్తారా? మండిపడ్డారు. సమ్రస్తా అనే ఫౌండేషనుకే గుళ్లు కట్టమని నిధులిచ్చారని, సమ్రస్తా ఫౌండేషనుకున్న క్రెడిబులిటీ ఏంటీ..? ఆ సంస్థకే నిధులు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో భూముల సెటిల్ మెంట్ల కోసం పక్క రాష్ట్రాలకు స్వామి వారి నిధులిస్తారా? అని మండిపడ్డారు. తాము అడక్కుండానే వైవీ సుబ్బారెడ్డి నిధులిచ్చారని కేటీఆర్ చెప్పారని పేర్కొన్నారు.

YV Subbareddy : చిరుత దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారి.. పరామర్శించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

లాబీయింగ్ చేసుకోవడానికి ఫ్లైల్ లు వేసుకుని వెళ్తారా..? అని మండిపడ్డారు.శ్రీవాణి ట్రస్టు నిధులా..? వైసీపీ డబ్బులా..? శ్రీవాణి ట్రస్టు నిధులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శ్రీవాణి ట్రస్టుపై విమర్శలు చేస్తే కేసులు పెడతారా..? నిలదీశారు. శ్రీవాణి ట్రస్టు విరాళాలిచ్చే వారి పేర్లు వెబ్ సైటులో పెట్టాలని సూచించారు. పింక్ డైమండ్ కొట్టేశారన్న విజయసాయి రెడ్డిపై ఏం కేసులు పెట్టారో చెప్పాలన్నారు. భక్తులు డబ్బులు ఏమయ్యాయంటే కేసులు పెడతారా..? అని మండిపడ్డారు.

స్వామి వారితో పెట్టుకున్న వాళ్లు ఇక్కడ లేరు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. ఏడు కొండలను ఐదు కొండలు చేస్తామన్నవారు ఏమయ్యారో తెలుసుకోవాలన్నారు. కాంట్రాక్టుల కోసం, బెయిళ్ల కోసం స్వామి వారిని అడ్డం పెట్టుకుంటారా..? అని మండిపడ్డారు. తాము అన్నదానం ట్రస్ట్.. ప్రాణదానం ట్రస్టులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తమ హయాంలో డీడీలు, బ్యాంక్ చెక్ ల ద్వారానే నిధులను తీసుకున్నారని తెలిపారు. నగదు తీసుకుని టిక్కెట్లిస్తే ఎలా లెక్కల్లోకి వస్తుందన్నారు.

Mudragada Padmanabham : మీ బెదిరింపులకు భయపడి నేను లొంగిపోను.. పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాసిన ముద్రగడ

శ్రీవాణి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్దరణ అని అన్నారు. ఏపీలో జీర్ణావస్థలో ఉన్న గుళ్లు లేవా..? పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు అమ్మడమేంటీ..? అని నిలదీశారు. తమ హయాంలో పింక్ డైమండ్ పోయిందన్నారు..? చంద్రబాబు కొట్టేశారన్నారని పేర్కొన్నారు. మరి పింక్ డైమండ్ సంగతి ఏమైంది..? ఏం చేశారు..? ప్రశ్నించారు. పింక్ డైమండ్ పై తాము అధికారంలో ఉన్నప్పుడు కోర్టులో కేసు వేశామని పేర్కొన్నారు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు.

వెంకన్నను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం జగనుకే స్వామివారిపై భక్తి లేదన్నారు. దంపత సమేతంగా స్వామి వారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను సమర్పించాలి కానీ.. జగన్ ఏ రోజూ అలా చేయలేదని విమర్శించారు. “నేను ఏక లింగం అంటూ జగన్ ఒక్కరే వెళ్లి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇస్తారు అని ఎద్దేవా చేశారు. ఇందిరా, సోనియాలే డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం
చేసుకున్నారు.