Chandrababu Naidu: రజనీకాంత్పై వైసీపీ నేతల విమర్శలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..
శిఖరంలాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఇప్పటికైనా నోటిదూల నేతలను అదుపులో పెట్టుకో అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
Chandrababu Naidu: నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో(Vijayawada) జరిగిన శతజయంతి అంకురార్పణ సభలో సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. రజినీకాంత్కు ఎప్పట్నుంచో బాలకృష్ణ (Balakrishna), ఎన్టీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబుతో కూడా రజినీకాంత్కు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యలపై పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా చంద్రబాబు విజనరీ కలిగిన నేత అని, హైదరాబాద్ నగరం అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఏపీని కూడా చంద్రబాబు అద్భుతంగా తీర్చిదిద్దుతాడని, ఆ సత్తా చంద్రబాబుకు ఉందని రజనీకాంత్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.
Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini
రజనీకాంత్ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రోజా, వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నానితో పాటు పలువురు రజనీకాంత్ కు అసలు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని మాట్లాడాడు అంటూ ప్రశ్నించారు. కొడాలి నాని పరుషపదజాలంతో రజనీకాంత్ పై విమర్శలు చేశారు. రెండు రోజులుగా వైసీపీ నేతల విమర్శలు తీవ్రస్థాయికి చేరడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతల తీరుపై దేశ, విదేశాల్లోని రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Andhra Pradesh: సూపర్ స్టార్ రజనీకాంత్పై కొడాలి నాని, మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
రజనీకాంత్పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్ క్యారెక్టర్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని, ఎన్టీఆర్తో తన అనుభవాలను రజనీ పంచుకున్నారని అన్నారు. రజనీకాంత్ లాంటి లెజెండరీ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం పనితీరుపై రజనీకాంత్ చిన్న విమర్శకూడా చేయలేదు. ఎవరినీ చిన్న మాటకూడా అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థంలేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు అని చంద్రబాబు అన్నారు. శిఖరంలాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని గుర్తుపెట్టుకో.. నోటిదూల నేతలను అదుపులో పెట్టుకో జగన్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమతప్పు సరిదిద్దుకోవాలని చంద్రబాబు వైసీపీ నేతలకు సూచించారు.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ… pic.twitter.com/CjyhyviDNb
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023