సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

  • Published By: vamsi ,Published On : June 2, 2020 / 06:04 AM IST
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం(02 మే 2020) ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. ఆయన పర్యటన వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేసుకోగా.. అమిత్‌ షా షెడ్యూల్‌ మారడంతో పర్యటన ఆగిపోయింది.  

తన పర్యటనలో భాగంగా లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి జగన్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం భేటీ కావాల్సి ఉంది. అయితే అమిత్‌ షాతోనే కాక ఢిల్లీ టూర్‌లో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. 

షెడ్యుల్‌ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడింది. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నారు. 

Read: రైలు దిగగానే పరీక్షలు.. క్వారంటైన్‌కు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం