Coronavirus : బాబోయ్.. ఒక్కరోజే 7లక్షల కరోనా కేసులు, 10వేల మరణాలు
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 10వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. పెరిగిన కేసులు, మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Coronavirus : వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 10వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. పెరిగిన కేసులు, మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
అమెరికా, బ్రిటన్, ఇరాన్ సహా పలు దేశాల్లో వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగా మారుతోంది. ఒక్క అమెరికాలోనే నిన్న దాదాపు 1.16 లక్షల కేసులు, 614 మరణాలు నమోదు కాగా.. ఇరాన్లో 39వేలకు పైగా కేసులు, 568 మరణాలు వెలుగుచూశాయి. బ్రిటన్లోనూ దాదాపు 33వేల మందికి కొవిడ్ సోకింది. జులై 23 తర్వాత తొలిసారి నమోదైన అత్యధిక కేసులు ఇవే.
జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,54,62,557 మందికి వైరస్ సోకగా.. 43,35,111మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 18.5కోట్ల మందికి పైగా కోలుకున్నారు.
డెల్టా వేరియంట్ విజృంభణ కారణంగానే తమ దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్టు బ్రిటన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో సిడ్నీలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్కు అడ్డుకట్ట వేయడంలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అదనపు మిలటరీ సిబ్బందిని కూడా రంగంలోకి దించుతున్నట్టు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.