TSRTC ఆపరేషన్ సెక్షన్ లో ఆఫీసర్ కు కోవిడ్..ఏపీ – తెలంగాణ మధ్య RTC బస్సులు లేనట్లే !

  • Published By: madhu ,Published On : June 25, 2020 / 02:15 AM IST
TSRTC ఆపరేషన్ సెక్షన్ లో ఆఫీసర్ కు కోవిడ్..ఏపీ – తెలంగాణ మధ్య RTC బస్సులు లేనట్లే !

TSRTC ఆపరేషన్ సెక్షన్ లో ఆఫీసర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న చర్చలు తాత్కాలికంగా బ్రేక్ పడ్డాయి. దీంతో ఏపీ – తెలంగాణ మధ్య RTC బస్సులు లేనట్లేనా అనే అనుమానం కలుగుతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు చర్చలు జరుపుతున్నారు. 2020, జూన్ 24వ తేదీ బుధవారం నాడు జరగాల్సిన ఈ చర్చల ప్రక్రియ వాయిదా పడ్డాయి. దీనికి చర్చల్లో పాల్గొనే అధికారికి కరోనా సోకడమే. 2020, జూన్ 17వ తేదీన అంతర్ రాష్ట్ర ఒప్పందంపై APSRTC, TSRTC అధికారులు విజయవాడలో చర్చలు ప్రారంభించారు. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. 

ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు వాయిదా పడడంతో బస్సులు తిరుగుతాయా ? లేదా ? అనే సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉంటే..ఏపీలో సిటీ బస్సులు తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని..బస్సులు నడపాలని, విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లినా..ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే జూన్ 01వ తేదీ నుంచి ఏపీలో బస్సులు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. సగటున 3 వేల 266 బస్సులు నడిపింది. 20 రోజుల నుంచి రోజుకు రూ. 2.43 కోట్ల ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. కరోనా వైరస్ కంటే ముందు..ఆర్టీసీకి రూ. 12 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడిస్తున్నారు అధికారులు. 

Read: TS ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువు పెంపు