తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతుళ్లు

తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే. ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 02:37 PM IST
తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతుళ్లు

తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే. ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని

తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే. ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని చాటిచెప్పారు ఆ ఇద్దరు. సాధారణంగా జరిగే దానికి భిన్నంగా కుమార్తెలే కొడుకులయ్యారు. తండ్రి భౌతిక కాయాన్ని కడవరకు తీసుకెళ్లారు. కర్మకాండలు జరిపించారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. పర్చూరుకు చెందిన ఆడపాల హనుమంతురావు(64) సోమవారం(మార్చి 9,2020) అనారోగ్యంతో మృతిచెండాడు. అతనికి కొడుకులు లేరు. హనుమంతురావుకు భార్య పద్మావతి, కూతుళ్లు సృజన, స్పందన ఉన్నారు. వారికి వివాహమైంది. ఒకరు అమెరికా, మరొకరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తండ్రి మరణించటంతో మంగళవారం(మార్చి 10,2020) పర్చూరులోని నివాసానికి వచ్చారు.

1

కర్మకాండలు పూర్తి చేయాలంటే వారసుడు లేరే అంటూ బంధువులు వాపోతున్న సమయంలో కూతులిద్దరూ ముందుకొచ్చారు. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి చితికి నిప్పటించారు. పెద్ద కూతురు దహనక్రియకు ఉపయోగించే నిప్పుల కుంపటి పట్టుకోగా చిన్న కూతురు స్పందన పిండం పట్టుకొని తండ్రి పాడె వెంట నడిచారు. స్థానిక స్మశాన వాటికలో హనుమంతురావు భౌతిక కాయాన్ని కట్టెల పాడెపై ఉంచగా చిన్న కుమార్తె స్పందన తండ్రి భౌతిక కాయానికి తలకొరివి పెట్టింది. 

తండ్రికి తలకొరివి పెట్టి జన్మనిచ్చిన రుణం తీర్చుకున్నారు ఆ కూతుళ్లు. కొడుకులైనా, కుమార్తెలైనా తల్లిదండ్రుల కన్నపేగు మమకారాన్ని మరువకూడదనే సత్యాన్ని చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు.

3