Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Accident

Prakasam Road Accident : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

Digital Rape : 17 ఏళ్ల బాలికను డిజిటల్ రేప్ చేసిన 81 ఏళ్ల వృధ్దుడు అరెస్ట్

అయితే కారు నెంబర్ ప్లేట్ కూడా మంటల్లో కాలిపోవడంతో సజీవ దహనం అయిన వారి వివరాలు గుర్తించడానికి ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత విచారణలో కారు నెంబర్ తో పాటు సజీవ దహనం అయిన వారి వివరాలు పోలీసులు కనుగొన్నారు. దగ్ధమైన కారు చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం ఆదినవారి పల్లె గ్రామనికి చెందిన నరేంద్రదిగా పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ AP 39 DE 6450 (హోండా అమేజ్). కారు డ్రైవర్ రావూరి తేజగా గుర్తించారు. బాకరాపేట నుండి శ్రీశైలంకు కారులో వెళ్తుండ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సజీవ దహనమైన మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఇక కర్నాటకకు చెందిన లారీ.. విజయవాడ వైపు వెళ్తోంది. లారీ నెంబర్ KA14C2949.

Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

స్పీడ్ గా వెళ్తున్న కారు టైర్ పేలిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అందులోనే చిక్కుకున్నారు. కారులోని పెట్రోల్ రోడ్డు మీద పడింది. రోడ్డుకు, కారుకు రాపిడి జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. కారులో చిక్కుకున్న వారు బయటకు వచ్చే మార్గం లేకపోయింది. మంటలు చెలరేగడంతో కారులోనే ఆ ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం జరిగాక లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు. లారీ నెంబర్ ఆధారంగా దాని ఓనర్ ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.