Woman Gang Rape : రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..భర్తను బెదిరించి అఘాయిత్యం

అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి వచ్చిన రైలు దిగిన భార్యాభర్తలను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎర్రగొండపాలెం నుంచి తాపీ పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్తున్న దంపతులు అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో దిగారు.

Woman Gang Rape : రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..భర్తను బెదిరించి అఘాయిత్యం

Repalle

Gang rape of a woman : బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను బెదిరించి, దాడి చేసి ఫ్లాట్ ఫామ్ పైనే అతని భార్యపై అఘాయిత్యం చేశారు. అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి వచ్చిన రైలు దిగిన భార్యాభర్తలను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఎర్రగొండపాలెం నుంచి తాపీ పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్తున్న దంపతులు అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో దిగారు. బస్ స్టాండ్ కు వెళ్లి, బస్సు ఎక్కి గమ్య స్థానానికి చేరుకోవాల్సివుంది. అర్ధరాత్రి సమయం కావడంతో దంపతులు రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్-1 పైనే నిద్రించారు.

Guntur : ఆలయంలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం

ఆ సమయంలో అక్కడకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు భర్తను బెదిరించారు. అతనిపై దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది.