Janasena Nagababu : పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి, 2024లో సీఎంగా చూసుకోవచ్చు-నాగబాబు

పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి. అలాంటి కార్యకర్త అవసరం. పవన్ చెప్పింది వింటే 2024లో సీఎంగా చూసుకోవచ్చు.

Janasena Nagababu : పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి, 2024లో సీఎంగా చూసుకోవచ్చు-నాగబాబు

Janasena Nagababu

Janasena Nagababu : ఉత్తరాంధ్ర కార్యకర్తలు మోటివేట్ అయి ఉన్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. నాయకులు పని చేయకపోతే చేయి మెలిపెట్టి ప్రశ్నించే స్ధాయికి ఎదిగారని కితాబిచ్చారు. సమస్య వచ్చినప్పుడు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ అని నాగబాబు చెప్పారు. పవన్ వెళితే సమస్య తీరుతుందనే నమ్మకం ఏర్పడిందన్నారు. ఉత్తరాంధ్రలో సమస్య వస్తే పవన్ అవసరం లేదని, జన సైనికులు వస్తే చాలని భావించేంతలా నమ్మకం ఏర్పడిందన్నారు నాగబాబు.

‘ఉత్తరాంధ్రలో లీడర్ షిప్‌ సమస్య ఉంది. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికులు పోరాట‌పటిమ అమోఘం. ఎన్నికల్లో డబ్బుతో ప్రలోభాలు పెట్టినా, పోటీ చేసి ఓడినా నైతికంగా గెలిచారు. వైజాగ్ రుషికొండ వ్యూ చాలా‌ అద్భుతమైనది. రుషికొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. నేనేం చేస్తున్నా జనసేనకు అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ఉత్తరాంధ్ర టూర్ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. కార్యకర్తల కష్టాన్ని దగ్గరుండి చూశా.

Nagababu : చిరంజీవి మద్దతు జనసేనకే.. మెగా అభిమానుల మద్దతు వారి ఇష్టం.. నాగబాబు వ్యాఖ్యలు..

వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా మారిపోయింది. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు. ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. జనసేన కౌలు రైతులను పట్టించుకోలేదని అనడం కన్నా జగన్, చంద్రబాబు శాసనసభను కౌలుకు తీసుకుని లక్ష ఇవ్వొచ్చుగా.

Nagababu : చిరంజీవితో విభేదాలు సృష్టించడానికి కుట్ర – నాగబాబు

పవన్ కు నా వైపు నుంచి ఎటువంటి సమస్య ఉండదు. పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి. అలాంటి కార్యకర్త అవసరం. మిలిటెంట్ మైండ్ సెట్ కలిగినోళ్లు జనసేన సైనికులు. ఎవరినైనా గ్రౌండ్ లో పాతరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం పవన్ కు తెలుసు. కానీ, పవన్ అగ్రెసివ్ గా వెళ్లవద్దని చెప్తుంటారు. అదీ సంయమనమంటే.

స్వార్ధం, కన్నింగ్ మైండ్, లంచగొండితనం లేని వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ చెప్పింది వింటే 2024లో పవన్ ను సీఎంగా చూసుకోవచ్చు’ అని జనసేన నేత నాగబాబు అన్నారు.

NagaBabu: మీ అధికారం ఐదేళ్లే జగన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై నాగబాబు