భార్యతో అక్రమ సంబంధం ఉందని..లారీతో తొక్కించి చంపేశాడు

  • Published By: madhu ,Published On : October 4, 2020 / 10:58 AM IST
భార్యతో అక్రమ సంబంధం ఉందని..లారీతో తొక్కించి చంపేశాడు

Bobbili : భార్యతో వివాహేతర సంబంధం ఉందని భావించి..సొంత స్నేహితుడినే చంపేశాడు. కింద పడుకోబెట్టి…లారీతో తొక్కించి మరీ చంపాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. బొబ్బిలి పోలీసులు వెల్లడించిన ప్రకారం..కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ముల్పూరి రాంగోపాల్ (28), అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ తోట నాగేంద్రబాబులు ఇధ్దరూ ఫ్రెండ్స్.



ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్ కు వెళుతున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వచ్చేశాడు రాం గోపాల్. ఇంట్లో వారితో తరచూ మాట్లాడేవాడు. కానీ..సెప్టెంబర్ 05వ తేదీ తర్వాత ఆయన ఫోన్ పని చేయలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోలకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.



రాంగోపాల్ వాడిన ఫోన్ బొబ్బిలో ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. నాగేంద్ర బాబుతో సన్నిహితంగా మెలుగుతాడని కుటుంబసభ్యులు చెప్పారు. అయితే..ఇక్కడ..హైదరాబాద్ వెళుతానని చెప్పిన రాంగోపాల్..స్నేహితుడు నాగేంద్ర బాబుతో కలిసి లారీలో గుజరాత్ వెళ్లారు. అక్కడి నుంచి సెప్టెంబర్ 05వ తేదీన మార్బుల్స్ లోడ్ తో బొబ్బిలి వచ్చారు.



వీరు ప్రయాణించిన లారీలో..క్లీనర్ శివ కూడా ఉన్నాడు. బొబ్బిలిలో సరుకు దించిన అనంతరం తిరుగుప్రయాణంలో ఓ పారిశ్రామిక వాడ వద్ద ఆపారు. అక్కడ రాంగోపాల్ కు మద్యం తాగించాడు. సృహ కోల్పోయేంత వరకు మద్యం తాగించాడు. అనంతరం రాంగోపాల్ ను కింద పడుకోబెట్టాడు. లారీని అతనిపై నుంచి పోనిచ్చాడు.



అప్పటికే నిద్ర మత్తులో ఉన్న శివ తేరుకున్నాడు. రాంగోపాల్ ఎక్కడా అని ప్రశ్నించాడు. విశాఖలో ఉన్న అతని సోదరుడు ఇంటికి వేరే వాహనంలో వెళుతానని దిగిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల విచారణలో ఈ దారుణం వెలుగు చూసింది.