Minister Roja : మంత్రి రోజా సెల్ ఫోన్ దొరికింది.. ఎలా గుర్తించారు ?
సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరకు దొంగని కనుక్కున్నారు. వెంటనే అతడిని పట్టుకుని మంత్రి రోజా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ దొరకడంతో...
Minister Roja Cell Phone : మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీకి గురి కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. దొంగను గుర్తించేందుకు ఏకంగా మూడు బృందాలు గాలింపులు చేపట్టాయి. మంత్రి ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరకు దొంగని కనుక్కున్నారు. వెంటనే అతడిని పట్టుకుని మంత్రి రోజా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. 2022, ఏప్రిల్ 21వ తేదీ గురువారం మంత్రి రోజా తిరుపతికి వచ్చారు.
Read More : Tirupati : మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్సింగ్.. మూడు పోలీసు టీంల గాలింపు
అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఫోన్ను పోగొట్టుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన శాప్ మీటింగ్కు హాజరైన తర్వాత సెల్ఫోన్ మిస్ అయినట్టు గుర్తించారు మంత్రి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోజా ఫోన్ కనుగొనేందుకు మూడు టీమ్లు సెర్చ్ చేశాయి. పద్మావతి గెస్ట్హౌజ్, ఎస్వీ వర్సిటీలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద ఫోన్ చోరీ అయినట్లు గుర్తించారు. అనంతరం సీసీ ఫుటేజ్ లో ఓ దొంగ సెల్ ఫోన్ చోరీ చేసినట్లు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగ రుయా ఆసుపత్రి వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి దొంగను పట్టుకుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సెల్ ఫోన్ ను మంత్రి రోజాకు అప్పగించారు. మొత్తంగా 165 నిమిషాల అనంతరం సెల్ ఫోన్ దొరికింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Read More : Ongole RTO : కారు తీసుకెళ్లడంపై మంత్రి బాలినేని కామెంట్స్
తిరుపతికి వచ్చిన మంత్రి రోజా తొలుత ఎస్వీయూ ఆవరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామీ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి రోజాకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రి రోజాను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం ఎస్వీయూ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో స్పోర్ట్ అథారిటీ ఆప్ ఏపీ (శాప్) రాష్ట్ర స్థాయి సమీక్షలో పాల్గొన్నారు.