Girl Kidnapped: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మేనమామ.. ఆట కట్టించిన పోలీసులు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్నకు గురైంది. ఆమెను బంధువులు, మేనమామే కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో, బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
Girl Kidnapped: బలవంతంగా పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మైనర్ అయిన సొంత మేనకోడలినే కిడ్నాప్ చేశాడు మేనమామ. చివరకు పోలీసులు సకాలంలో స్పందించడంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్నకు గురైంది. ఆమెను బంధువులు, మేనమామే కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో, బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది. దీంతో ఇంట్లో నుంచి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
presidential polls: వెంకయ్య నాయుడితో నడ్డా, షా, రాజ్నాథ్ భేటీ.. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ?
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో వేగంగా స్పందించారు. హై అలర్ట్ యాప్ ద్వారా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ అప్రమత్తం చేశారు. మూడు గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి బాలికను సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో కిడ్నాప్నకు పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. మరోవైపు తమ కూతురును కొన్ని గంటల్లోనే కిడ్నాపర్ల నుంచి కాపాడిన పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతఙ్ఞతలు తెలిపారు.