Kanipakam Temple : కాణిపాకం రథ చక్రాలకు నిప్పు.. చిత్తు కాగితాలు ఏరుకునే వారి పనే?
కొత్త రథ చక్రాలు తయారు చేయడంతో 15ఏళ్ల క్రితం పాత రథ చక్రాలను ఆలయానికి దూరంగా పడేశామని తెలిపారు. వాటితో పాటు ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే..

Kanipakam Temple : చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయ సమీపంలో కాణిపాకం ఆలయానికి చెందిన పాత రథ చక్రాలకు దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథ చక్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రథ చక్రాలకు నిప్పు ఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
కాలిపోయిన రథ చక్రాలు సుమారు 15 సంవత్సరాల కిందటివి అని చెప్పారు. కొత్త రథ చక్రాలు తయారు చేయడంతో 15ఏళ్ల క్రితం పాత రథ చక్రాలను ఆలయానికి దూరంగా పడేశామని తెలిపారు. వాటితో పాటు ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే వారు ఎవరో ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.
Back Pain : నడుంనొప్పి బాధించటానికి కారణాలు తెలుసా?
ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను కోరామని ఎమ్మెల్యే బాబు, ఆలయ ఛైర్మన్ వెల్లడించారు. కాణిపాకం ఆలయ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రథ చక్రాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.
ఇటీవల ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు కలకలం రేపాయి. ఆ తర్వాత తగ్గిపోయాయి. ఆలయాలపై దాడులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై మళ్లీ దుమారం మొదలైంది. గతంలో పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురవడంపై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నట్టు పోలీసులు ప్రకటించారు.
- Youngster Suicide : తల్లిదండ్రుల వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య
- Chittoor : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్
- Maoists Set Fire Bus : ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య.. బస్సును దగ్ధం చేసిన మావోలు
- Extra Marital Affair : స్నేహితుడి ప్రియురాలితో పరిచయం…హత్య
- West Godavari : పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లిన దుండగులు
1Palm Oil: పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తేసిన ఇండోనేషియా
2Pakistan To Adilabad Explosives : పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్కు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు.. విచారణ వేగవంతం
3F3: ఎఫ్3 రన్టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
4Mangoes Harvesting : మామిడిలో కాయకోతల సమయంలో జాగ్రత్తలు!
5Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
6Supreme Court : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు: సుప్రీం ఆదేశం
7Bendapudi High School Students : ఇంగ్లీష్లో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. సీఎం జగన్ ఫిదా
8Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
9Poorna: పింక్ కలర్ డ్రెస్సులో పూర్ణ హొయలు.. చూసినోళ్లకు చూసినంత!
10Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!
-
NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!
-
EATING FOOD : భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
-
Man Saves Dog:పెళ్లి పక్కకుపెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా కుక్కను కాపాడిన పెళ్లికొడుకు
-
Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!
-
Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
-
Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?